
చక్రి సోదరుడు మహిత్ సంగీత సారథ్యంలో రూపొందిన కరోనా పాటను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా మహమ్మారి ని కట్టడి చేయడానికి పోలీసులు ,డాక్టర్లు , పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా రాజీలేని పోరాటం చేస్తున్నారు.. ఈ నేపథ్యం లో వారి సేవలను కొనియాడుతూ ప్రముఖ గేయ రచయిత బాలాజీ రాసిన పాటకు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందించారు . ప్రముఖ గాయనీ గాయకులు మనో, టిప్పు, శ్రీకృష్ణ ,సాయి చరణ్,నిహాల్ , గీతామాధురి ,,అదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, విలేజ్ సింగర్ బేబీ పాడిన ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు ..ఈ కార్యక్రమం లో మహిత్ మిత్రులు ప్రభాకర్ , రాజు తదితరులు పాల్గొన్నారు … ఆనంతరం
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ : 10 మంది గాయనీ గాయకులు పాట పాడిన తీరు , బాలాజీ గారి రచన , మహిత్ నారాయణ్ గారి సంగీతం చాలా బాగుందని ప్రశంసించారు . పోలీసులు ,డాక్టర్లు ,పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ పాట రాయడం మరింత స్పూర్తినిచ్చిందని అన్నారు . ఈ పాట కోసం పని చేసిన టీమ్ మెంబెర్స్ కి అల్ ది బెస్ట్ చెప్పారు .
సంగీత దర్శకులు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ : కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడానికి పోలీసులు ,డాక్టర్లు , పారిశుద్ధ కార్మికులు చేసే సేవలకు ప్రతిఒక్కరు చేతులెత్తి మొక్కాలి … వారి గురుంచి పాట చేయడం .. ఆ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు లాంచ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు . నా మిత్రుల సహకారంతో ఈ పాటను చెయ్యగలిగానని అన్నారు . నాకు సహకరించిన గాయనీ గాయకులకు ,మిత్రులు ప్రభాకర్ ,రాజు కు కృతజ్ఞతలు తెలిపారు