
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగానే కాదు మనదేశంలో కూడా విజృభిస్తుంది. అయితే ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం అనేక రకాల కార్యచరణలు చేస్తున్నాయి. ఇక యావత దేశంలో ఉన్న ప్రముఖలందరూ తమ వంతుగా కరోనా నివారణకు అనేకనేక సహాయసహకారాలు అందిస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రధాన మంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ మనీ కంపెనీ పే టీ ఎమ్ వారు ప్రధాన మంత్రి సహాయ నిధికి సామాన్యులు సైతం విరాళం అందించేలా ఓ వినూత్న ఫండ్ రైజింగ్ ప్రొగ్రామ్ ప్రారంభించారు. ఈ ఫండ్ రైజింగ్ ద్వారా 500 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సహాయనిధికి సమీకరించేలా పే టి ఎమ్ కార్యచరణ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పే టి ఎమ్ యాప్ నుంచి కానీ వెబ్ సైట్ నుంచి కానీ ఎదైనా వస్తువు కొన్నా లేదా డొనేషన్ చేసినా ఆ మెత్తానికి 10 రూపాయలు కలిపి ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందేలా పేటిఎమ్ వారు ఈ ప్రొగ్రామ్ ను డిజైన్ చేశారు. మనందరి మంచి కోసం పే టిఎమ్ వారు తలపెట్టిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అతి త్వరలో 500 కోట్లు సమీకరించి ప్రధాన మంత్రి సహాయనిధికి అందచేస్తామని పే టి ఎమ్ అధికారక ప్రతినిధి తెలిపారు.
